* రాఖీ పండుగ పరిచయం:- సోదరులకు సోదరీమణులకు ఇది ప్రత్యేక పండగ.
-- మన భారత దేశ సంప్రదాయాలలో , ప్రేమ, అనురాగం, ఆప్యాయత, మమతలకి, కుటుంభానికి, కుటుంభ బంధాలకు, విలువలకు ఒక మహోన్నతమైన ప్రత్యేక స్థానం ఉంది. అందులో భాగంగా రాఖీ పౌర్ణమి పండగ లేదా రక్షా బంధన్ పండగ అన్న, చెల్లెళ్ళు, అక్కా, తమ్ముళ్ళ మధ్య లో ఉన్న అనుబంధ భాందవ్యాన్ని ఇంకా ఎక్కువగా బలపరిచే పవిత్రమైన పండగే ఈ రాఖీ పౌర్ణమి.
-- ఈ పర్వ దినాన సోదరి వాళ్ళ సోదరునికి రాఖీ కడుతుంది. అలా రాఖీ కట్టడం ద్వారా సోదరీ తన ప్రేమను, ఆప్యాయతను తెలియచేస్తుంది.
-- సోదరుడు కూడా ప్రేమగా తన సోదరికి ఎన్ని కష్టాలు వచ్చినా వాటి నుండి రక్షించుకుంటానని హామీ ఇస్తాడు.
* రాఖీ పండుగ యొక్క చరిత్ర మరియు నేపథ్యం:-
-- రాఖీ పండుగ కి కొన్ని చారిత్రక కథలు అలాగే కొన్ని పురాణ కథలు కూడా ఉన్నాయి. వాటిలో నుండి కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
1, మహా భారతంలోని ఒక కథ:-
-- శ్రీ కృష్ణుడు మహా భారతంలో శిశుపాలున్ని సంహరించేటప్పుడు, కృష్ణుని చేతికి గాయం అవుతుంది. అది చూసిన ద్రౌపది వెంటనే ఆమె చీరలో నుండి ఒక ముక్కను చించి ఆ గాయానికి కడుతుంది. ఆమె ప్రేమకు కృతజ్ఞతగా ద్రౌపది ని ఎప్పటికీ కాపాడుతూ ఉంటా అని వాగ్దానం ఇస్తాడు. ఇదే కథ రాఖీ పండుగ రావడానికి ఒక పురాణ కథ గా చెప్పబడింది.
2, చారిత్రక కథలు:-
-- కర్నావతి అనే ఒక రాజస్థాన్ కి చెందిన రాణి ఒకసారి మొఘల్ చక్రవర్తి అయిన హుమాయూన్ కి రాఖీ పంపించి, ఆమె యొక్క రాజ్యాన్ని తన శత్రువుల నుంచి కాపాడమని వేడుకుంది అతను కాపాడుతా అని మాట ఇస్తాడు. దానికి బదులుగా హుమాయూన్ తను ఇచ్చిన మాట నిలపెట్టుకొని ఆ రాణిని కాపాడుతాడు. ఈ కథ కేవలం రక్త సంబంధాలకే కాకుండా మానవ సంబంధాలకు కూడా విలువలతో ప్రేమతో విస్తరించబడింది అని ఈ కథ రుజువు అవుతుంది.
3, ఇంద్రాణి మరియు ఇంద్రుని కథ :-
-- పురాణ కథల్లో ఇంద్రాణి ఒకసారి ఇంద్రునికి యుద్ధంలో విజయం జరగాలని ఒక పవిత్రమైన దారం కట్టింది. అది రక్షా తాడుగా పరిగణించ బడింది.
ధర్మస్థల లో జరిగిన భయంకరమైన నిజాలు
* మరి ఈ రాఖీ పండుగ ఎలా జరుపుకోవాలి ?
-- ఈ రాఖీ పండుగ రోజు ముందుగా సోదరీ తన సోదరునికి బొట్టు పెట్టి , హారతి తీసి తర్వాత ఆమె తెచ్చిన రాఖీ కడుతుంది.
-- కట్టిన తర్వాత తీయగా చేసిన పదార్థాలను సోదరునికి తినిపిస్తుంది.
-- తర్వాత సోదరుడు అతని సోదరికి గిఫ్ట్స్ ఇచ్చి, నిన్ను నేను అన్ని కష్టాల నుంచి కాపాడతాను అని మాట ఇస్తాడు. దాని వల్ల వాళ్ళ మధ్య సోదర సోదరీ మణుల బంధం ఇంకా ఎక్కువగా ప్రేమగా ఆప్యాయంగా మారుతుంది.
* ఇప్పుడు రాఖీ పండుగ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం:-
1, రాఖీ పండుగ అనేది ఒక మంచి అనుబంధానికి నిదర్శనం:-
-- రాఖీ అనేది కేవలం దారం మాత్రమే కాదు అధి ఒక ప్రేమకు, రక్షణకు, నమ్మకానికి, మధ్య నిలువెత్తు నిదర్శనంగా నిలబడ్డ ఒక మంచి పవిత్ర బంధంగా చెప్పుకోవచ్చు.
2, రాఖీ పౌర్ణమి విలువలతో కూడిన సంస్కృతి:-
2. సాంస్కృతిక విలువలు – భారతీయ సంస్కృతిలో కుటుంబ బంధాలు ఎంత ముఖ్యమో గుర్తు చేస్తుంది.
3, కులం, మతం, జాతి అనే వివక్ష లేని పండగ:-
-- భారత దేశం లో కులాలు మతాలు చాలా ఉన్నాయి కానీ ఆ తేడాలు ఏమీ లేకుండా ప్రతీ ఒక్కరు జరుపుకునే పండుగ ఈ రాఖీ పండుగ, అందరూ ప్రేమ, ఆప్యాయత, అనురాగాల తో ఈ రాఖీ పౌర్ణమి నీ సంతోషంగా జరుపుకుంటారు.
4, సమాజంలో ఐకమత్యం:-
* మరి ఈ ఆధునిక కాలంలో రాఖీ పండుగ ఎలా జరుపుకుంటున్నారు ?
* రాఖీల రుపులు కూడా మారాయి !
-- ఒకప్పుడు కట్టుకునే రాఖీలు ఇప్పుడు ఎక్కువగా కనపడవు ఎక్కడో ఒక్కటి మచ్చుకు మాత్రమే కనిపిస్తాయి, పాత కాలంలో రాఖీలు చాలా పెద్దగా సాంప్రదాయంగా ఉండేవి కానీ ఇప్పుడు అవి తన రూపాన్ని మార్చుకొని updated అయ్యి కొత్త కోణంలో, కొత్త డిజైన్ లో రాఖీలు వస్తున్నాయి. అలాగే పర్యావరణానికి మేలు చేసే రాఖీలు కూడా వచ్చాయి. అలాగే చిన్న పిల్లలకి కార్టూన్ రాఖీలు కూడా వచ్చాయి. బ్రాస్ లైట్ డిజైన్ లో కూడా రాఖీలు వస్తున్నాయి. ఎలా మారినా కూడా వాటిని ఈ పర్వ దినాన అన్నా తమ్ముళ్లు, అక్కా చల్లెళ్ళు, స్నేహితులు మరియు శ్రేయోభిలాషులు కూడా సంతోషంగా జరుపుకుంటున్నారు.
0 కామెంట్లు