* ధర్మస్థల లో జరిగిన అత్యాచారాల నేపథ్యం:-
-- Dharmasthala (ధర్మస్థల) లో జరిగిన సంఘటనల మీద అత్యంత లోతైన విషయాలను ఇక్కడ మీకు నేను చెప్పబోతున్నాను.
-- ధర్మస్థల మాస్ బరియల్ కేసు గురించి అక్కడ జరిగిన అత్యాచారాల గురించి తెలుసుకున్న ప్రతీ ఒక్కరు ఇది నమ్మలేక పోతున్నారు ఇది నిజమా అబద్ధమా అనే బ్రమలోనే ఉండిపోయారు. కానీ అదే నిజం. అక్కడ మహిళల మీద చిన్నారుల మీద అత్యాచారాలు చేసి వాళ్ళని చంపారు, ఆ మరణాలు వాటి దహనాలు కొన్ని 100 ల సంఖ్యలో ఉంటాయి అని చెప్తున్నారు. అవి వింటే వెన్నులో వణుకు పుట్టే అంత భయంకరంగా జరిగాయి అని చెప్తున్నారు, ఆ నిజాలు వింటే నిజంగానే నాకు వెన్నులో వణుకు పుట్టేలాగానే అనిపించింది.
* మరి ఈ నిజాలు అన్ని ఎలా బయటకు వచ్చాయి, ఎవరు బయట పెట్టారు తెలుసుకుందాం:-
-- ఆ ప్రదేశంలో పారిశుధ్య పని చేసే ఒక వ్యక్తి ఈ విషయాల మీద పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన మొదటి ఫిర్యాదు, గత నెల జూలై 2025 లో ఫిర్యాదు చేశాడు.
అతను 1995 నుండి 2014 వరకు అక్కడే పారిశుధ్య పని చేశాడు అంటా.
-- స్వయంగా అతని చేతులతోనే 100 కి పైగా మహిళలను, చిన్న పిల్లల శవాలను లాక్కొని తీసుకొని వచ్చి పాతి పెట్టాను అని, అవ్వన్నీ నాతో బలవంతంగా చేయించారు అని ఒకవేల నువు చేయకపోతే నిన్ను నీ కుటుంబాన్ని కుడా చంపేస్తామని బెదిరించారు అని అందుకే నేను అలా చేశాను అని, కానీ అధి నన్ను చాలా బాధ పెడుతుంది అని, ఆ సంఘటనలు నన్ను బాధ పెడుతున్నాయి అని అతను చెప్పాడు, ఫస్ట్ ఆ హత్యలను ఆత్మ హత్యలు అని చిత్రీకరించి నాకు చెప్పారు అని ఆ చనిపోయిన వాళ్ళు ఎవరో వాళ్లు ఎందుకు చనిపోయారో మాకు తెలియదు అని వాళ్ళు వచ్చి ఆ దర్మస్తల నీళ్లలో దూకి చనిపోయారు అని నాకు చెప్పి వెళ్లి వాళ్ళని పూడ్చి పెట్టు అని చెప్పేవారు కానీ అలా ఆ హత్యలు ఎప్పటికీ జరుగుతుండేవి అని అతను చెప్పడం జరిగింది.
చాలా మంది మహిళలు, స్కూల్ యూనిఫాం లో ఉన్న పిల్లలు కూడా చనిపోయారు, మహిళల ఒంటి మీద బట్టలు లేకుండా అలాగే కొట్టి హింసించిన గాయాలు ఉండేవి అవ్వన్నీ చూసి ఒక్కరోజు నేను అడిగాను కానీ వాళ్ళు నాకు చెప్పలేదు నీకు అవ్వన్నీ అవసరం లేదు మేము చెప్పిన పని నువు చేయు అని ఈ విషయాలు బయట ఎవరికీ అయిన చెప్తే నిన్ను నీ కుటుంబాన్ని కుడా చంపేస్తామని బెదిరించారు అందుకే నేను అలా చేశాను అని కానీ ఇప్పుడు కూడా నేను చెప్పకపోతే ఈ భయంకరమైన నిజాలు నాతోనే అంతం అవుతాయి అని, ఆ సంఘటనలు నన్ను చాలా మనోవేదనకు గురి చేస్తున్నాయి అని ఇప్పటికీ కూడా నేను ఈ నిజాలు చెప్పకపోతే ఆ పాపం నన్ను నా కుటుంబాన్ని నా తరతరాలను వెంటాడుతూనే ఉంటాయి.
ఆ భయంకరమైన పనులు ఆ మనుషులు ఆ శవాలు ఇంకా కూడా నన్ను వెంటాడుతూనే ఉన్నాయి, నా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి, నేను ఒక రకమైన మనోవేదనకు గురి అవుతున్న, రాత్రుళ్లు నాకు నిద్ర కూడా పట్టదు, అవే గుర్తుకు వస్తాయి, ఇక నా వల్ల కావట్లేదు, ఆ చెదు నిజాలని నేను ఇక మోయలేను, ఆ గిల్టీ ఫీలింగ్ నన్ను రోజు రోజుకి చంపేస్తుంది, ఇలా రోజు ఆ పచ్చాతాపం తో బ్రతకడం నా వల్ల కావట్లేదు, ఆ పాపాన్ని ఇక నేను మోయలేను ఆ నిజాలు నాతోనే అంతం కాకూడదు అని అవ్వన్నీ విషయాలు అతను చెప్పడం జరిగింది.
నిజంగా ఈ విషయాలు వింటుంటే ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా ఈ సమాజంలో, ఇంత క్రూరంగా ఆలోచిస్తున్నార, ఇలాంటి భయంకరమైన పనులు ఎలా చేయగలుగుతున్నారు, వాళ్ళకి ఆ అలాంటి మనసు ఎలా వస్తుంది, దేనికోసం అట్లా చేస్తున్నారు, వాళ్ళు మనుషుల లేక రాక్షసుల మరి ఇంత సైకో ఆలోచనలు వాళ్ళకి ఎలా వచ్చాయి అని తలుచుకుంటేనే ఛీ అని వాళ్ళ మీద నాకు అసహ్యం వేస్తుంది, ఇలాంటి పనులు చేసి ఏం రాక్షస ఆనందం పొందుతున్నారు నాకు అర్ధం కావట్లేదు, డబ్బు కోసం చేస్తున్నారా లేదా సుకం కోసం చేస్తున్నారా లేదా ఇంక దేనికోసమైన చేస్తున్నారా నాకు అయితే అర్ధం కావడం లేదు కానీ ఇలాంటి సమాజంలో మనం ఉన్నామ అనిపిస్తే చాలా బాదగా, కోపంగా, ఆవేదనగా, అసహనంగా, ఆక్రోషంగా, నీచంగా అనిపిస్తుంది అలాంటి మనుషుల గురించి వాళ్ళు చేసిన పనుల గురించి వింటుంటే,
మనం ఎక్కడ ఉంటున్నాం మనుషుల మద్యలోన లేదా క్రూర మృగాల మద్యలోనా అనిపిస్తుంది, మనం నేర్చుకున్న విలువలు ఏంటి మనం పుట్టిన నేల మనకి ఏం నేర్పింది, మన తల్లి తండ్రులు నేర్పిన ధర్మం ఏంటి ?, మనం పుట్టిన నేల మనకు నేర్పిన ధర్మం ఏంటి ? మనకు మన పెద్ద వాళ్ళు నేర్పిన ధర్మం ఏంటి ? మనం ఏం చేస్తున్నాం, ఎలా బ్రతుకుతున్నాం, ఎలాంటి పనులు చేస్తున్నాం, దేని కోసం బ్రతుకుతున్నాం, ఎవరి కోసం బ్రతుకుతున్నాం, ఏం సాదిస్తున్నాం, చివరికి ఎక్కడికి పోతాం అందరం, ఏం తీసుకొని పోతాం ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లేటప్పుడు అని ఒక్కరూ కూడా ఎందుకు ఆలోచిస్తాలేరు, ఎటు పోతుంది ఈ సమాజం, ఎటు వెళ్తున్నారు ఈ మనుషులు, ఇంత నీచమైన బ్రతుకులు ఎందుకు బ్రతుకుతున్నారో ఎంత ఆలోచించినా కూడా నాకు అర్ధం కావడం లేదు, దానికి సమాదానం దొరకడం లేదు మరీ ఇంత దారుణంగా ఎందుకు దిగజారిపోయి బ్రతుకుతున్నారు ఒక్కసారి అందరూ ఆలోచించండి ప్లీజ్ ఇది నా పర్సనల్ ఒపీనియన్.
* ఫిర్యాదు నమోదు తర్వాత విచారణకు సిద్దం:-
ఈ సంఘటనకు సంబంధించిన మొదటి కేసు జులై 4 న దక్షిణ కన్నడ పోలీస్ స్టేషన్ లో FIR నమోదు కావడం జరిగింది. జూలై 11 తారీకు రోజున ఆ sanitation చేసే వ్యక్తి BNSS section 183 ప్రామాణికంగా అతను ఈ విషయాలు అన్ని కోర్టు లో చెప్పాడు. అవసరం అయితే నేను ఇప్పటివరకు వాళ్ళు చేసిన హత్యల వల్ల చనిపోయిన తర్వాత వాటిని తీసుకొని పోయి స్వయంగా నేనే పాతి పెట్టిన శవాలను ఆ ప్రాంతాన్ని చూపిస్తా మీరు రండి వచ్చీ ఆ ప్రాంతాన్ని మొత్తం తవ్వి చూడండి అప్పుడు మీకే అన్నీ విషయాలు తెలుస్తాయి అని అతను చెప్పాడు.
అతను చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే నిజంగా అక్కడ అత్యాచారాలు చాలా భయంకరంగా చాలానే జరిగి ఉంటాయి అని అందరికీ అనుమానాలు వస్తున్నాయి.
-- అవ్వన్నీ అతను దైర్యంగా చెప్పిన తర్వాత karnataka లో ఉన్న women's commission దీన్నీ సీరియస్ గా తీసుకొని, అవ్వన్నీ సాక్షాలను పరిశీలించి, దీని కోసం వెంటనే ప్రభుత్వం "SIT " ఏర్పాటు చేయాలి అని చాలా గట్టిగా డిమాండ్ చేసింది.
* SIT ఏర్పాటు మొదలు అయ్యింది:-
-- కర్ణాటక ప్రభుత్వం దీని మీద జులై 19 న SIT ని ఏర్పాటు చేసింది. దీనికోసం SIT లో pronab mahanthi ని DGP గా నియమించారు.
-- ఈ SIT బృందంలో ఎవరెవరు ఉన్నారు అంటే Pronab mahanthi, M.N Anucheth, jithendra dayama, S.K Soumyalatha, వీళ్ళని ఏర్పాటు చేసింది ఈ కేసు గురించి దర్యాప్తు చేసి పూర్తి వివరాలు తెలియచేయడం కోసం.
* SIT బృందం విచారణ కోసం వెతుకులాట:-
-- దీని కోసం అంతర్గత భద్రతా మరియు విచారణ నిపుణులు కలిసి మొత్తం 15 burial sites ని గుర్తించడం జరిగింది.
-- నేత్రవతి నది ఒడ్డున , హైవే పక్కన, ఇంకా కొన్ని మిగతా ప్రదేశాలలో చూడటం జరిగింది.
మొదటి రోజు 5 సైట్లలో చూడటం జరిగింది కానీ ఎలాంటి ఆధారాలు దొరకలేదు.
-- మూడవ రోజు 6 వ సైట్ లో partial skeletal remains అయితే దొరికాయి. తర్వాత జెసిబి తో 4 అడుగుల లోతు కోణం తీసుకొని తవ్వారు .
-- 5 వ రోజు 9 మరియు 10 వ సైట్స్ లో కూడా తవ్వారు కానీ ఏం దొరకలేదు
-- అయితే కర్నాటక లో భారీ వర్షాలు పడుతున్నాయి దాని వల్ల తవ్వకాలు ఆగిపోయాయి తవ్వినవి కూడా వెతకడానికి ఇబ్బందిగా ఉండడంతో అక్కడ ఏం దొరకలేదు.
-- 6వ రోజు 11 వ సైట్ లో కొత్తగా suspected remains recovered కావడం జరిగింది. Verification కోసం ముందస్తుగా సమాచారం ఇవ్వడం జరిగింది.
-- 6 వ సైట్ లో దొరికిన వాటిని forensic ప్రాసెస్ కోసం ఆ ఎముకలను లాబ్ కి పంపించడం జరిగింది.
-- వాటిని DNA పరీక్ష ద్వారా ఆ విక్టిమ్ జెండర్, వయసు ఎలా చనిపోయారు అని ప్రస్తుతం తెలుసుకుంటున్నారు.
-- అదేవిధంగా ఇప్పుడు ananya Bhat తో సహా మిగతా స్టూడెంట్స్ కి సంబంధించిన విషయాలు ఇప్పుడు బాగా ఫోకస్ అవుతున్నాయి.
* ప్రజల యొక్క స్పందన అలాగే సామాజిక ఒత్తిడి ఎలా ఉంది:-
-- All India democratic women's association (AIDWA) కి సంబంధించిన వాళ్లు సౌజన్య, వేదవల్లి, యమున, పద్మలత వీళ్లకు సంబంధించిన కేసులను మళ్ళీ అన్వేషించి విచారణ చేయాలి అని చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. చేయకపోతే ఊరుకునేది లేదు అని ఇంకా ఎన్ని దారుణాలు బయటికి వస్తాయో తెలియదు కాబట్టి కచ్చితంగా వీటిని కూడా దర్యాప్తు చేయాలి అని అక్కడ ప్రజల నుండి ఎక్కువగా అలాగే భలంగా డిమాండ్ వినిపిస్తోంది, మరి అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చూడాలి.
-- SIT దర్యాప్తు జాగ్రత్తగా జరగాలి అని , వాళ్ళకి పూర్తిగా autonomy ఇవ్వాలని హెచ్చరించారు. ఎవరు ఎన్ని చేసినా కూడా టెంపుల్ యాజమాన్యాలు చేసిన కూడా దర్యాప్తు transparency గా జరగాలి అని కోరుకున్నారు. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగకుండా, నిజాలను దాచి పెట్టకుండా, న్యాయాన్ని సమాది చేయకుండా, బాదితులకి న్యాయం జరిగే లాగా అలాగే తప్పు చేసిన వాళ్ళకి కటినమైన శిక్ష పడే లాగా అన్నీ నిజాలు బయటికి రావాలి అందరికీ తెలియాలి ఇలాంటివి ఇంకెప్పుడు జరగకుండా కటినమైన శిక్షలు పడాలి అని అక్కడ ఉన్న ప్రజల అందరూ కోరుకుంటున్నారు.
-- 2013 వ సంవత్సరం వరకు దగ్గర దగ్గర 462 మంది Unnatural గా చనిపోయారు అని public records లో ఉన్నాయి.
-- మిగతా సైట్స్ ని future steps ground penetrating Radar (GPR) అనే పరికరాన్ని ఉపయోగించి వెతకాలి అని సూచించారు.
-- పాత లొకేషన్స్ change కావడం వల్ల అలాగే మట్టి కూడా change కావడం వల్ల landmarks కొంత మేరకు మారిపోయాయి.
-- SIT బృందం యొక్క investigation పూర్తి అయ్యాక దానికి సంబదించిన పూర్తి report Karnataka government కి అందచేస్తారు. దాని తర్వాత ఆ government decision తీసుకోనుంది.
* ఈ విషయం మీద మీరు ఏం అనుకుంటున్నారు కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఇలాంటి మంచి విషయాల కోసం డైలీ మన website ని follow అవ్వండి ఇది మన website name - www.trendtelugu.world
ఇంకా ఈ విషయాన్ని మీ friends కి కూడా షేర్ చేయండి.
Thank you for your Reading...
.webp)
0 కామెంట్లు