* భారతదేశం బానిసత్వం నుండి విముక్తి పొంది, (freedom) స్వేచ్ఛ వాయువులు పొందిన రోజు ఆగష్టు 15, 1947.
-- ఎంతో మంది ప్రాణ త్యాగాలకు, భారత ప్రజల ఔన్నత్యానికి, స్వేచ్చకీ చిహ్నమే భారత స్వాతంత్రం ( Independence India) దాని గురించి పూర్తి సమాచారం ఎమోషనల్ గా ఈ ఆర్టికల్ లో జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయే వాటి గురించి క్లియర్ గా తెలుసుకుందాం.
-- స్వాతంత్ర దినోత్సవాన్ని భారత దేశం ప్రతీ సంవత్సరం ఆగష్టు 15 రోజున దేశం అంతటా అందరూ ప్రజలు కులము, మతము ప్రాంతము అనే భేదము లేకుండా ఘనంగా జరుపుకుంటున్నాం. జరుపుకోవాలి ఎందుకు అంటే ఈ దేశం కేవలం ఒక కులనికో లేదా ఒక మతానికో లేదా కొంత మంది వ్యక్తులకో సంబందించిన దేశం కాదు ఇది బారతీయల అందరి దేశం అందరి హక్కు కాబట్టి అందరూ కలిసి దేశ భక్తి ని చాటి చెప్పుకొని హాపీగా అందరం అన్న తమ్ములలాగా కలిసి మెలిసి జరుపుకోవాల్సిన రోజు ఇది.
-- (Indian independence history) ఈ రోజు మన దేశ చరిత్రలో అత్యంత కీలకమైన ప్రాముఖ్యమైన రోజు , ఎందుకు అంటే బ్రతుకు దెరువు కోసం మన దేశం వచ్చి ముందు చిన్నగా వ్యాపారం చేసుకొని ఆ వ్యాపారాన్ని కాస్త పెద్ద బిసినెస్ గా మార్చుకొని ఇక్కడ ఉన్న ప్రజలని మోసం చేసి, కుట్రలతో, కుతంత్రాలతో మన దేశ పరిపాలనను వారి చేతుల్లోకి తీసుకొని, మనల్ని బానిసలను చేసుకొని మనతోటి అన్నీ పనులని చేపించుకొని అత్యంత దారునంగా మనల్ని హింసించి, మన దేశం వచ్చి మనలనే దూషించి మనలనే పరిపాలనకి దూరం ఉంచి, మనల్ని హీనంగా చూసి 200 సంవత్సరాలు బ్రిటీష్ వాళ్ళు పరిపాలించారు.
-- అందుకే వాళ్ళ పాలన నుండి విముక్తి పొంది స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్న రోజే ఈ రోజు. కానీ ఈ స్వేచ్చ మనకు సునాయాసంగా, సులభంగా రాలేదు, కోట్ల మంది మన భారతీయుల త్యాగం, పోరాటం, అంతేకాకుండా సహనంతో వచ్చింది, మనకు ఈ స్వాతంత్రం.
* భానిసత్వం నుండి విముక్తి పొందే వరకు జరిగిన పోరాటం:-
* నాయకుల పోరాటం:-
* అద్భుతమైన క్షణం ఆగష్టు 15th 1947:-
-- 15th ఆగష్టు 1947, భారతదేశం ఒక కొత్త రోజుని చూసింది. జవహర్లాల్ నెహ్రు గారు రాత్రి 12 గంటలకు పార్లమెంట్లో తన "ట్రైస్ట్ విత్ డెస్టినీ" గురించి మాట్లాడటం జరిగింది. మొదటిసారి మన దేశ ఎర్రకోట పై భారత దేశ జాతీయ జెండా ఎగరవేయబడింది. అది సామాన్య జెండా మాత్రమే కాదు కోట్లాది మంది భారతీయుల త్యాగాలకు, కళలకు, ఆశలకు, స్వేచ్ఛ కు నిదర్శనమే మన జాతీయ జెండా. అది మన దేశ ప్రజల గౌరవానికి సంబందించిన క్షణం, ఆ క్షణంలో దేశం మొత్తం ఒక సంతోషకరమైన వాతావరణం, ఎటు చూసిన దేశ నలు మూలలా ప్రజల ఆనంద మహోత్సవాలు జరిగాయి, ఆ అద్భుతమైన గట్టం మన దేశ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోకుండా ప్రజల గుండెల్లో కలకాలం నిలిచి ఉంటుంది.
భారత దేశం మీద ఎక్కువ మొత్తంలో టారిఫ్ విధించిన డోనాల్డ్ ట్రంప్ ఇది చదివి తెలుసుకోండి.
* స్వాతంత్రం తో పాటు విభజన ప్రక్రియ:-
* అసలు స్వాతంత్రం యొక్క ఉద్దేశ్యం ఏంటి?
-- స్వాతంత్రం వచ్చింది ఒకే కానీ, స్వాతంత్రం అంటే ఎదో విదేశీ పరిపాలన నుండి విముక్తి పొందడం ఒక్కటే కాదు, మన భారత దేశ ప్రజల భవిష్యత్తును మనమే ఒక గొప్ప స్థాయిలో అభివృధ్ధి చేసుకొని మంచిగా నిర్మించుకోవడం అసలైన నిజమైన స్వాతంత్రం.
-- మన జాతీయ జెండా ను ప్రతీ సంవత్సరం ఆగష్టు 15 రోజున ఎంతో మంది త్యాగాలను గుర్తు చేసుకొని , జాతీయ పతాకాన్ని ఎగురవేసుకొని, మన జాతీయ గీతాన్ని పాడుకొని, దేశ భక్తిని చాటి చెప్పుకుంటాం. అది మాత్రమే కాకుండా మన దేశ ప్రజల భవిష్యత్తు కోసం, సమానత్వం కోసం, అందరి అభివృద్ధి కోసం, అందరం కలిసి మెలిసి జీవించడం కోసం, దేశంలో ఇంకా ఉన్న పేదరికాన్ని నిర్మూలించడం కోసం, దేశంలో ఉన్న రుగ్మతలను, తార తమ్యాలను రుపుమాపడం కోసం, దేశంలో ఉన్న అంటరాని తనాన్ని తొలగించడం కోసం, అందరం కలిసి ఎదగడం కోసం, ప్రపంచంలో భారత దేశం గొప్పది అని చాటి చెప్పడం కోసం ఈ స్వాతంత్రాన్ని మనం గొప్పగా జరుపుకోవాలి, భారత ప్రజలం అందరం ఒక్కటే అని వేరు వేరు కాదు అని మాటల్లో కాకుండా చేతల్లో చూపెట్టడం నిజమైన స్వాతంత్రం. మరి నిజంగా మన దేశంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయా అంటే కచ్చితంగా లేవు అనే చెప్పాలి, మన దేశంలో ఇంకా రుగ్మతలు ఉన్నాయి, అంటరాని తనం ఉంది, ప్రజలని దోచుకోవడం ఉనది, అవినీతి ఉన్నది, లంచాలు ఉన్నాయి, సమానత్వం లేదు, పేదరికం ఇంకా అలాగే ఉంది, ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు, పేదవాడు ఇంకా పేదవాడు అవుతున్నాడు, ఇవ్వన్నీ పోయిన రోజు నిజంగా మన దేశానికి మన దేశ ప్రజలకి స్వాతంత్రం వచ్చినట్లు, ఆ రోజు కోసం మనం అందరం అలాగే ప్రభుత్వాలు కూడా కలిసి పని చేస్తే అలాంటి ఒక రోజు వస్తుంది, దానికోసం అందరూ నిస్వార్ధంగా పని చేయాలి అలా చేస్తేనే ఆ రోజు వస్తుంది లేదంటే ఎవరి స్వార్ధం వాళ్ళే చూసుకుంటే అలాంటి రోజు మన దేశంలో ఎప్పటికీ రాదు కాబట్టి దయచేసి అందరం కలిసి కట్టుగా నిజాయితీగా, నీతిగా, ఎలాంటి తారతమ్యాలు లేకుండా, కుల,మత బేదాలు లేకుండా, ఎలాంటి రాగ ద్వేషాలు లేకుండా అందరం కలిసి ఒక్కటిగా ముందుకి వెళ్తే ప్రపంచంలోనే మన దేశం గొప్ప దేశం అవుతుంది అని ఈ ఆర్టికల్ ద్వారా నేను మీకు నా ఆలోచనని, బాదని మీతో పంచుకుంటున్నాను దీనికి మీరు ఏం అంటారో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి.
* మన దేశ ఎర్రకోట లో జరిగే సంబరాలు:-
-- మనం ప్రతీ సంవత్సరం మన దేశ రాజధాని అయిన న్యూ ఢిల్లీ లో ఉన్న ఎర్ర కోట దగ్గర మన దేశ ప్రధానమంత్రి జాతీయ జెండా ను ఎగరవేసి మన దేశం గురించి దేశ ప్రజల గురించి, దేశ విజయాలు, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను అంతే కాకుండా దేశ అభవృద్ధికి సంబంధించిన అన్నీ విషయాల గురించి మాట్లాడుతారు.
-- దేశంలో ఉన్న అన్నీ పాఠశాలలలో, గవర్నమెంట్ కార్యాలయాలలో, కలాశాలలలో, ప్రతీ చోట ఈ వేడుకలు జరుగుతాయి.
* భారత భవిష్యత్తు కోసం ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలి:-
-- మన దేశానికి మనకి స్వాతంత్ర్యం కోసం పోరాడి సాధించి ఇచ్చిన వారు వాళ్ళ ప్రాణాల కంటే కూడా దేశానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు.
-- కాబట్టి మన దేశ ప్రజల స్వేచ్ఛను మనం కాపాడటం మన యొక్క బాధ్యత, దేశ అభవృద్ధికి పాటు పడటం మన కర్తవ్యం, అంతే కాకుండా ఆదాయ అసమానతలు, రుగ్మతలు, అజ్ఞానం, మూఢనమ్మకాలు, లింగ భేదాలు, కుల బావనలు, మత విద్వేషాలు, పేదరికం ఇలాంటి సమస్యలు మన దేశంలో ఇంకా ఉన్నాయి, అవ్వన్నిటిని రుపు మాపడమే, అందరం కలిసి ఎదగడమే, మన దేశాన్ని ప్రపంచంలో గొప్ప దేశంగా నిలపెట్టడమే మనకు నిజమైన స్వాతంత్ర్యం. అలాగే ప్రతి పౌరుడు వాళ్ళ విధులను సక్రమంగా నిర్వర్తించాలి. మన దేశ చట్టాలను గౌరవించి వాటికి లోబడి నడుచుకోవాలి. మన దేశం కోసం సమాజం కోసం పని చేయాలి. ఇది అందరూ గుర్తు పెట్టుకోవాలి దాని కోసం పాటు పడాలి అని నా అభిప్రాయం. మరి మీరు ఏం అనుకుంటున్నారో మీ అభిప్రాయం కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి.
* ముగింపు మాటలు
* అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు (Happy independence day), అందరం బాగుండాలి , మన దేశం బాగుండాలి దాని కోసం అందరం కలిసి మెలిసి అందరం ఒక్కటే అని సమానత్వం, సౌభ్రాతృత్వం, సహనం తో విలువలతో ప్రేమతో ముందుకు వెళ్దాం, మన దేశాన్ని ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా నిలపెట్టుకుందాం.
నేను మీ సామ్యెల్ చిర్ర.
.webp)
0 కామెంట్లు