India independence day history


 

* భారతదేశం బానిసత్వం నుండి విముక్తి పొంది, (freedom) స్వేచ్ఛ వాయువులు పొందిన రోజు ఆగష్టు 15, 1947.

-- ఎంతో మంది ప్రాణ త్యాగాలకు, భారత ప్రజల ఔన్నత్యానికి, స్వేచ్చకీ చిహ్నమే భారత స్వాతంత్రం  ( Independence India) దాని గురించి పూర్తి సమాచారం ఎమోషనల్ గా ఈ ఆర్టికల్ లో జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయే వాటి గురించి క్లియర్ గా తెలుసుకుందాం.


-- స్వాతంత్ర దినోత్సవాన్ని భారత దేశం ప్రతీ సంవత్సరం ఆగష్టు 15 రోజున దేశం అంతటా అందరూ ప్రజలు కులము, మతము ప్రాంతము అనే భేదము లేకుండా ఘనంగా జరుపుకుంటున్నాం. జరుపుకోవాలి ఎందుకు అంటే ఈ దేశం కేవలం ఒక కులనికో లేదా ఒక మతానికో లేదా కొంత మంది వ్యక్తులకో సంబందించిన దేశం కాదు ఇది బారతీయల అందరి దేశం అందరి హక్కు కాబట్టి అందరూ కలిసి దేశ భక్తి ని చాటి చెప్పుకొని హాపీగా అందరం అన్న తమ్ములలాగా కలిసి మెలిసి జరుపుకోవాల్సిన రోజు ఇది.  

-- (Indian independence history) ఈ రోజు మన దేశ చరిత్రలో అత్యంత కీలకమైన ప్రాముఖ్యమైన రోజు , ఎందుకు అంటే బ్రతుకు దెరువు కోసం మన దేశం వచ్చి ముందు చిన్నగా వ్యాపారం చేసుకొని ఆ వ్యాపారాన్ని కాస్త పెద్ద బిసినెస్ గా మార్చుకొని ఇక్కడ ఉన్న ప్రజలని మోసం చేసి, కుట్రలతో, కుతంత్రాలతో మన దేశ పరిపాలనను వారి చేతుల్లోకి తీసుకొని, మనల్ని బానిసలను చేసుకొని మనతోటి అన్నీ పనులని చేపించుకొని అత్యంత దారునంగా మనల్ని హింసించి, మన దేశం వచ్చి మనలనే దూషించి మనలనే పరిపాలనకి దూరం ఉంచి, మనల్ని హీనంగా చూసి 200 సంవత్సరాలు బ్రిటీష్ వాళ్ళు పరిపాలించారు.

-- అందుకే వాళ్ళ పాలన నుండి విముక్తి పొంది స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్న రోజే ఈ రోజు. కానీ ఈ స్వేచ్చ మనకు సునాయాసంగా, సులభంగా రాలేదు, కోట్ల మంది మన భారతీయుల త్యాగం, పోరాటం, అంతేకాకుండా సహనంతో వచ్చింది, మనకు ఈ స్వాతంత్రం.


* భానిసత్వం నుండి విముక్తి పొందే వరకు జరిగిన పోరాటం:-

-- 1757 ప్లాసి యుద్ధం తర్వాత బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని మన దేశంలో పెంచుకుంది. వాణిజ్యంలో దోపిడి, భయంకరమైన పన్నుల భారం, కార్మికుల అద్వాన పరిస్థితి, రైతుల పేదరిక బ్రతుకులు, దేశ ప్రజల ఔన్నత్యానికి స్వేచ్చకీ సంకెళ్లు, దేశ ప్రజల బానిసత్వం, ఇవ్వన్నీ కలిపి భారత ప్రజల్లో ఒక భయంకరమైన అసంతృప్తి ని కలిగించాయి.

-- ఆ అసంతృప్తి వల్ల భారత దేశ ప్రజలకి కోపం వచ్చింది,విసుగు వచ్చింది, ఆలోచన వచ్చింది, దైర్యం వచ్చింది, తెగింపు వచ్చింది, పోరాటం చేయాలి అని భారత దేశంలో ప్రజలు ఎదురు తిరిగి  మొదటి స్వాతంత్ర సమరం 1857 లో సిపాయిల తిరుగుబాటుతో మొదలయ్యింది కానీ మొదటి తిరుగుబాటు లో మనకి పరాబావం ఎదురయ్యింది ఆ తిరుగుబాటులో బ్రిటిష్ సైన్యాలు మనల్ని అణచివేశాయి, దారుణంగా మన వాళ్ళని హింసించారు ఆ తిరుగుబాటులో. ఫస్ట్ తిరుగుబాటు సఫలం కాకపోయినా కూడా ప్రజల్లో స్వాతంత్రం కావాలి మాకు అన్న బలమైన ఆశయాన్ని రేకెత్తించింది. ఈ తిరుగుబాటు వల్లనే మన దేశ ప్రజలకి ఒక దైర్యం వచ్చింది. మన దేశానికి స్వాతంత్రం తెచ్చుకోవాలి ఎంత దూరం అయిన పోదాం ఏం జరిగిన మంచిదే ఎంత మంది ప్రాణాలు పోయిన మంచిదే కానీ మనకి కచ్చితంగా స్వేచ్చ కావాలి, మన దేశం మీద మనకి హక్కులు ఉండాలి, మన పరిపాలన మనకి ఉండాలి, మన అభివృద్ది మనం చేసుకోవాలి, ఈ బానిస బ్రతుకుల నుండి మనకి మన దేశానికి విముక్తి రావాలి అని దేశ ప్రజల అందరిలో ఒక పోరాట స్పూర్తి వచ్చింది.  


* నాయకుల పోరాటం:-


-- స్వాతంత్ర పోరాటానికి సంభందించి తర్వాత కాలంలో లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్, బిపిన్ చంద్రపాల్, మహాత్మా గాంధి, భగత్ సింగ్, చంద్ర శేకర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు, బొబ్బిలి బ్రహ్మన్న, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది గొప్ప గొప్ప నాయకులు, మన భారత దేశాన్ని బ్రిటీష్ ప్రభుత్వ పాలన నుండి విముక్తి కలిగించడం కోసం అహర్నిశలు కష్టపడి పోరాడి ప్రజల ఔన్నత్యం కోసం స్వేచ్ఛ కోసం ఒక్కటిగా పోరాడారు. అందులో చాలా మంది వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయారు, ఇంకా చాలా మంది ఖైదీలుగా భయంకరమైన జీవితాన్ని కూడా గడిపారు, కొంత మంది వాళ్ళ కుటుంబాలని బార్యాలని పిల్లలని వదిలేసి దేశం కోసం పోరాడి చనిపోయారు, ఇంకా కొంత మంది యుక్త వయసులోనే పెళ్లి జరగక ముందే చిన్న వయసులోనే స్వతంత్ర పోరాటంలోకి వచ్చి చాలా పొరటాలలో పాల్గొని చిన్న వయసులోనే వాళ్ళ ప్రాణాలు మన దేశం కోసం అర్పించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో గాదలు ఎన్నో బాదలు ఎన్నో కష్టాలు ఓర్చుకొని అందరి త్యాగ ఫలం ఇవ్వాళ మనం అనుభవిస్తున్న స్వేచ్చా స్వాతంత్రం.  


* అద్భుతమైన క్షణం ఆగష్టు 15th 1947:-

-- 15th ఆగష్టు 1947, భారతదేశం ఒక కొత్త రోజుని చూసింది. జవహర్లాల్ నెహ్రు గారు రాత్రి 12 గంటలకు పార్లమెంట్లో తన "ట్రైస్ట్ విత్ డెస్టినీ" గురించి మాట్లాడటం జరిగింది. మొదటిసారి మన దేశ ఎర్రకోట పై భారత దేశ జాతీయ జెండా ఎగరవేయబడింది. అది సామాన్య జెండా మాత్రమే కాదు కోట్లాది మంది భారతీయుల త్యాగాలకు, కళలకు, ఆశలకు, స్వేచ్ఛ కు నిదర్శనమే మన జాతీయ జెండా. అది మన దేశ ప్రజల గౌరవానికి సంబందించిన క్షణం, ఆ క్షణంలో దేశం మొత్తం ఒక సంతోషకరమైన వాతావరణం, ఎటు చూసిన దేశ నలు మూలలా ప్రజల ఆనంద మహోత్సవాలు జరిగాయి, ఆ అద్భుతమైన గట్టం మన దేశ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోకుండా ప్రజల గుండెల్లో కలకాలం నిలిచి ఉంటుంది. 

భారత దేశం మీద ఎక్కువ మొత్తంలో టారిఫ్ విధించిన డోనాల్డ్ ట్రంప్ ఇది చదివి తెలుసుకోండి.


* స్వాతంత్రం తో పాటు విభజన ప్రక్రియ:-


-- భారత దేశానికి స్వాతంత్రం వచ్చింది అన్న సంతోషం లేకుండా దేశ విభజన కోసం ప్రక్రియ మొదలయ్యింది. ఇది చాలా ధురదృష్టకరం. మా దేశం మాకు కావాలి అని మేము విడిపోతాం అని ముస్లిమ్స్ పట్టు పట్టి కూర్చుంటారు, హిందువులు ముస్లిమ్స్ మద్య పెద్ద వివాదం జరుగుతుంది. 
భారత్ మరియు పాకిస్తాన్ గా దేశం రెండుగా చీలిపోవడం కోసం కోట్లాది మంది గాయాల పాలయ్యారు, లక్షలాది మంది వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు. అవ్వన్నీ జరిగిన కూడా భారతీయులు వాళ్ళ గాయాలను మరచిపోయి కొత్త దేశాన్ని నిర్మించుకోవడం కోసం పయనం మొదలుపెట్టారు. వెంటనే మళ్ళీ మన దేశాన్ని పునర్నిర్మించుకోవడం కోసం అందరూ ముందుకి వచ్చారు. 


* అసలు స్వాతంత్రం  యొక్క ఉద్దేశ్యం ఏంటి?


-- స్వాతంత్రం వచ్చింది ఒకే కానీ, స్వాతంత్రం అంటే ఎదో విదేశీ పరిపాలన నుండి విముక్తి పొందడం ఒక్కటే కాదు,  మన భారత దేశ ప్రజల భవిష్యత్తును మనమే ఒక గొప్ప స్థాయిలో అభివృధ్ధి చేసుకొని మంచిగా నిర్మించుకోవడం అసలైన నిజమైన స్వాతంత్రం. 

-- మన జాతీయ జెండా ను ప్రతీ సంవత్సరం ఆగష్టు 15 రోజున ఎంతో మంది త్యాగాలను గుర్తు చేసుకొని , జాతీయ పతాకాన్ని ఎగురవేసుకొని, మన జాతీయ గీతాన్ని పాడుకొని, దేశ భక్తిని చాటి చెప్పుకుంటాం. అది మాత్రమే కాకుండా మన దేశ ప్రజల భవిష్యత్తు కోసం, సమానత్వం కోసం, అందరి అభివృద్ధి కోసం, అందరం కలిసి మెలిసి జీవించడం కోసం, దేశంలో ఇంకా ఉన్న పేదరికాన్ని నిర్మూలించడం కోసం, దేశంలో ఉన్న రుగ్మతలను, తార తమ్యాలను రుపుమాపడం కోసం, దేశంలో ఉన్న అంటరాని తనాన్ని తొలగించడం కోసం, అందరం కలిసి ఎదగడం కోసం, ప్రపంచంలో భారత దేశం గొప్పది అని చాటి చెప్పడం కోసం ఈ స్వాతంత్రాన్ని  మనం గొప్పగా జరుపుకోవాలి, భారత ప్రజలం అందరం ఒక్కటే అని వేరు వేరు కాదు అని మాటల్లో కాకుండా చేతల్లో చూపెట్టడం నిజమైన స్వాతంత్రం. మరి నిజంగా మన దేశంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయా అంటే కచ్చితంగా లేవు అనే చెప్పాలి, మన దేశంలో ఇంకా రుగ్మతలు ఉన్నాయి, అంటరాని తనం ఉంది, ప్రజలని దోచుకోవడం ఉనది, అవినీతి ఉన్నది, లంచాలు ఉన్నాయి, సమానత్వం లేదు, పేదరికం ఇంకా అలాగే ఉంది, ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు, పేదవాడు ఇంకా పేదవాడు అవుతున్నాడు, ఇవ్వన్నీ పోయిన రోజు నిజంగా మన దేశానికి మన దేశ ప్రజలకి స్వాతంత్రం వచ్చినట్లు, ఆ రోజు కోసం మనం అందరం అలాగే ప్రభుత్వాలు కూడా కలిసి పని చేస్తే అలాంటి ఒక రోజు వస్తుంది, దానికోసం అందరూ నిస్వార్ధంగా పని చేయాలి అలా చేస్తేనే ఆ రోజు వస్తుంది లేదంటే ఎవరి స్వార్ధం వాళ్ళే చూసుకుంటే అలాంటి రోజు మన దేశంలో ఎప్పటికీ రాదు కాబట్టి దయచేసి అందరం కలిసి కట్టుగా నిజాయితీగా, నీతిగా, ఎలాంటి తారతమ్యాలు లేకుండా, కుల,మత బేదాలు లేకుండా, ఎలాంటి రాగ ద్వేషాలు లేకుండా అందరం కలిసి ఒక్కటిగా ముందుకి వెళ్తే ప్రపంచంలోనే మన దేశం గొప్ప దేశం అవుతుంది అని ఈ ఆర్టికల్ ద్వారా నేను మీకు నా ఆలోచనని, బాదని మీతో పంచుకుంటున్నాను దీనికి మీరు ఏం అంటారో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి.   


* మన దేశ ఎర్రకోట లో జరిగే సంబరాలు:-

-- మనం ప్రతీ సంవత్సరం మన దేశ రాజధాని అయిన న్యూ ఢిల్లీ లో ఉన్న ఎర్ర కోట దగ్గర మన దేశ ప్రధానమంత్రి జాతీయ జెండా ను ఎగరవేసి మన దేశం గురించి దేశ ప్రజల గురించి, దేశ విజయాలు, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను అంతే కాకుండా దేశ అభవృద్ధికి సంబంధించిన అన్నీ విషయాల గురించి మాట్లాడుతారు.

-- దేశంలో ఉన్న అన్నీ పాఠశాలలలో, గవర్నమెంట్ కార్యాలయాలలో, కలాశాలలలో, ప్రతీ చోట ఈ వేడుకలు జరుగుతాయి.


* భారత భవిష్యత్తు కోసం ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలి:-

-- మన దేశానికి మనకి స్వాతంత్ర్యం కోసం పోరాడి సాధించి ఇచ్చిన వారు వాళ్ళ ప్రాణాల కంటే కూడా దేశానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. 

-- కాబట్టి మన దేశ ప్రజల స్వేచ్ఛను మనం కాపాడటం మన యొక్క బాధ్యత, దేశ అభవృద్ధికి పాటు పడటం మన కర్తవ్యం, అంతే కాకుండా ఆదాయ అసమానతలు, రుగ్మతలు, అజ్ఞానం, మూఢనమ్మకాలు, లింగ భేదాలు, కుల బావనలు, మత విద్వేషాలు, పేదరికం ఇలాంటి సమస్యలు మన దేశంలో ఇంకా ఉన్నాయి, అవ్వన్నిటిని రుపు మాపడమే, అందరం కలిసి ఎదగడమే, మన దేశాన్ని ప్రపంచంలో గొప్ప దేశంగా నిలపెట్టడమే మనకు నిజమైన స్వాతంత్ర్యం. అలాగే ప్రతి పౌరుడు వాళ్ళ విధులను సక్రమంగా నిర్వర్తించాలి. మన దేశ చట్టాలను గౌరవించి వాటికి లోబడి నడుచుకోవాలి. మన దేశం కోసం సమాజం కోసం పని చేయాలి.  ఇది అందరూ గుర్తు పెట్టుకోవాలి దాని కోసం పాటు పడాలి అని నా అభిప్రాయం. మరి మీరు ఏం అనుకుంటున్నారో మీ అభిప్రాయం కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి.

       * ముగింపు మాటలు

* అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు (Happy independence day), అందరం బాగుండాలి , మన దేశం బాగుండాలి దాని కోసం అందరం కలిసి మెలిసి అందరం ఒక్కటే అని సమానత్వం, సౌభ్రాతృత్వం, సహనం తో విలువలతో ప్రేమతో ముందుకు వెళ్దాం, మన దేశాన్ని ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా నిలపెట్టుకుందాం. 

             నేను మీ సామ్యెల్ చిర్ర.               

జై భారత్ జై భారత రాజ్యాంగం వందే మాతరం 

    

    Thank you for your Reading