* ప్రస్తుతం మాజీ Twitter CEO Parag Agarwal ఎందుకు trend అవుతున్నాడు ఏం జరిగింది అని క్లారిటీగా తెలుసుకుందాం:-
-- పరాగ్ అగర్వాల్ పరిచయం:-
* పరాగ్ అగర్వాల్ నేపథ్యం తెలుసుకుందాం:-
తర్వాత stanford University లో Masters అలాగే P.HD కూడా పూర్తి చేశాడు.
-- Parag Agarwal కి చిన్నప్పటినుండే కంప్యూటర్స్ అన్నా అలాగే గణితం అన్నా ఇష్టం ఉండేది అంటా, దాని related గానే అతను చదువుకొని టెక్ రంగంలో ఎదిగి అమెరికాలో స్థిరపడ్డాడు. ఇది మాటల్లో చెప్పినంత ఈసీ కాదు అమెరికాలో సెటిల్ అవ్వడం అంటే, అతను అంతా పెద్ద స్తాయికి రావడానికి అతను ఎంత కష్టపడి ఉంటాడో ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి చేసి ఉంటాడో ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపి ఉంటాడో, ఎంత మంది చేతిలో అవమానాలు పడి ఉంటాడో, ఎంత మంది అతన్ని వెనక్కి లాగాలి అని చూసి ఉంటారో, ఎంత మంది అతన్ని నీ వల్ల కాదు ఇవ్వన్నీ నీకు ఎందుకు అవసరమా వదిలేయి అని డిస్కరేజ్ చేసి ఉంటారో మనకి తెలియదు అవ్వన్నీ అతని మనసుకి మాత్రమే తెలుసు అతను ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని బాదలు పడ్డాడో, ఎంతమంది తో ఎన్ని మాటలు పడ్డాడో ఇప్పుడు ఉన్న స్థాయి కి రావడానికి, అలాగే వాళ్ళ అమ్మ నాన్నలు అతనికి ఎన్ని రకాలుగా సపోర్ట్ చేసి ఉంటారో, వాళ్ళు అతనికి ఎంత మోటివేషన్ ఇచ్చి ఉంటారో, అన్ని విషయాలలో వాళ్ళ అమ్మ నాన్నలు అతని వెనకే ఉండి అతను ఈ స్థాయికి రావడానికి ఎంత కృషి చేసి ఉంటారో మనం ఆలోచించుకోవచ్చు, అమ్మ నాన్నల కష్టం కూడా కచ్చితంగా ఉంటుంది 80% పిల్లల విజయాలలో అమ్మ నాన్నల పాత్ర ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు. కష్టపడితే కచ్చితంగా విజయం సాదిస్తాం అని మంచి స్థాయిలో నిలబడతాం అని పరాగ్ అగర్వాల్ నిరూపించాడు, అతని కష్టం, అతని సంకల్పం, సాదించాలి అన్న తపన, అతనికి అన్నీ విషయాలలో సపోర్ట్ గా ఉన్న అమ్మ నాన్నల ప్రేమ ఇవ్వన్నీ అతన్ని ఈ స్థాయిలో నిలబెట్టాయి అనుకోవచ్చు.
*అగర్వాల్ యొక్క Twitter ప్రయాణం:-
-- ఇక్కడ అతని యొక్క నైపుణ్యం అంకితభావం, కష్టపడే తత్వం వల్ల జస్ట్ 8 సంవత్సరాలలోనే ఒక సాధారణ ఇంజినీర్ నుండి ఒక CEO స్థాయికి అతను ఎదిగాడు, అధి మన అందరికీ ఒక inspiration అవ్వాలి అనుకుంటున్న.
* కొంతకాలం తర్వాత CEO పోస్టు పోవడం:-
-- 2022 వ సంవత్సరంలో Twitter ని ఎలాన్ మస్క్ కొనుక్కున్న తర్వాత పరిస్థితులు చాలా మారాయి .
ఎలాన్ మస్క్ ట్విట్టర్ కంపెనీ ని తీసుకు న్న తర్వాత కొద్ది రోజుల్లోనే మస్క్ పరాగ్ ఆగర్వాల్ ని తను ఉన్న CEO పదవి నుంచి తీసివేశాడు. ఎందుకు అనేది ఎవరికీ స్పష్టంగా తెలియదు కానీ ఎలాన్ మస్క్ ఆలోచనలు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి అతనే దాని యజమాని కాబట్టి అతని యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో వాటి ప్రకారం నిర్ణయాలు తీసుకుంటాడు కాబట్టి అందులో భాగంగా ఎలాన్ మస్క్ తీసుకున్న నిర్ణయం పరాగ్ అగర్వాల్ ని CEO గా తొలగించడం, కేవలం పరాగ్ అగర్వాల్ ని మాత్రమే తొలగించాడా అంటే కాదు అందులో ఉన్న చాలా మంది ఉద్యోగులని తొలగించి కొత్త వారిని నియమించుకున్నాడు.
కానీ 2022లో ఎలాన్ మస్క్ ట్విట్టర్ను కొనుగోలు చేసిన వెంటనే పరిస్థితి మారింది. ప్రపంచం మొత్తం అధి ఒక పెద్ద చర్చకి దారి తీసింది, తర్వాత పరాగ్ కి నష్ట పరిహారం చెల్లించినా కూడా, ఉన్నట్లుండి CEO పదవి పోవడం అనేది ఒక బాధగా మిగిలింది.
* అవ్వన్నీ ఎప్పుడో అయిపోయాయి మరి ఇప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతున్నాడు:-
-- పరాగ్ ఆగర్వాల్ ప్రస్తుతం ఎందుకు వార్తల్లోకి వచ్చాడు, అతను వార్తల్లోకి రావడానికి కారణం కొత్తగా ఆయన స్టార్ట్ చేసిన AI startup- Parallel web systems. మెయిన్ రీసన్.
* మరి ఈ స్టార్టప్ లో అంతగణం ఏం స్పెషాలిటీ ఉంది ?
-- పరాగ్ ఆగర్వాల్ ఈ కంపెనీని 2023 లోనే స్థాపించారు కానీ ఇప్పుడు అధి ఈ 2025 సంవత్సరానికి ఆగష్టు నెల వరకు $ 30 మిలియన్ల ఫండ్ ని సేకరించింది, కాబట్టి ఇప్పుడు అతను ట్రెండ్ అవుతున్నాడు.
ఇది కూడా చదవండి 2025 లో AI Tools తో యువతకి కొత్త ఉద్యోగ అవకాశాలు.
* మరి ఈ స్టార్టప్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి ?
-- ప్రస్తుతం మనకు చాలా AI లు అందుబాటులో ఉన్నాయి. example:- ChatGpt , deepseek అలాగే Gemini, ఇవి మనకు ప్రి ట్రెయిన్డ్ డేటా ఆధారంతో సమాధానాలు చెప్తాయి.
-- పరాగ్ start చేసిన స్టార్టప్ మాత్రం అలా కాదు , AI స్వతంత్రంగా ఇంటర్నెట్ లో ఉన్న సమాచారాన్ని బ్రౌస్ చేసి తాజా information నీ సేకరించి దాన్ని నిజమా కాదా అని దృవికరించి ఆ తర్వాత యూజర్స్ కి ఇవ్వాలి. అంటే నార్మల్ గా ఉండే చాట్ బాట్ లాగా కాకుండా, నిజంగా ఒక information ని ఒక అసిస్టెంట్ గా రీసెర్చ్ చేసి ఇస్తుంది.
* దీని మీద అంతగనం పెట్టుబడి పెట్టడానికి ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు:-
-- ఇప్పటివరకు పరాగ్ ఆగర్వాల్ స్టార్ట్ చేసిన parallel web systems కి ఫస్ట్ రౌండ్ క్యాపిటల్, ఇండెక్స్ వెంచర్స్, అలాగే khosla ventures లాంటి చాల పెద్ద పెద్ద కంపెనీలు ఇందులో పెట్టుబడి నిధులు సమకుర్చాయి అని చెప్తున్నారు.
-- అతను చెప్పిన సమాచారం ప్రకారం భవిష్యత్తులో AI రంగంలో AI dynamic web అనే ఐడియా ఒక మంచి విప్లవాత్మకమైన change తీసుకువస్తుంది అని నమ్ముతున్నారు.
-- ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే ఇప్పుడు మనం అందరం use చేస్తున్న Chat Gpt -5 కంటే కూడా ఇది ఇంకా తెలివిగా వర్క్ చేస్తుంది అని చెప్పడంతో ఈ project మీద అందరికీ మరింత ఆసక్తి పెరిగింది.
*మరి ప్రజల్లో ఎందుకు అంత హడావిడి అవుతుంది ?
1, ఒక సాధారణ ఇంజినీర్ నుండి CEO గా ఎదిగి తర్వాత ఇప్పుడు ఒక entrepreneur గా ఎదగడం అలాగే తను కోల్పోయిన CEO పదవి తర్వాత మళ్ళీ ఇప్పుడు AI రంగంలో తన journey ఎలా ఉంటుంది అని అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.
2, అతను ఇండియాకి సంబంధించిన వ్యక్తి, అలాగే అతను ఐఐటీ బాంబే లో చదువుకొని ఈ స్థాయికి ఎదిగిన భారతీయుడు ఒక సిలికాన్ వ్యాలీలో ఇంత పెద్ద స్థాయిలో ఒక AI startup ని ప్రారంభించడం అనేది భారత ప్రజలకి ఒక స్ఫూర్తిని ఇస్తుంది.
3, ప్రస్తుతం ఒక ChatGpt తోటి పోటీ పడి అంతకు మించిన కొత్త technology అభివృద్ధి చేస్తా అని అతను చెప్పడం ఇంకా ఆసక్తిని రేకెత్తిస్తుంది. అందుకే ఇప్పుడు అతను సోషల్ మీడియాలో Google లో ట్రెండ్ అవుతున్నాడు.
* ముగింపు మాటలు:-
-- ఒక సాధారణ ఇంజినీర్ నుండి ఒక కంపెనీకి CEO గా ఎదిగి, తర్వాత అది పోయినా కూడా దిగులు చెందకుండా ఇంకా ఎక్కువగా పట్టుదలతో ముందుకి వెళ్ళి ఇప్పుడు ఒక గొప్ప AI స్టార్టప్ స్టార్ట్ చేసి ప్రస్తుతం ఉన్న టెక్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలి అని ఇంకా మంచి క్వాలిటీ information ఇవ్వాలి అని ప్రయత్నం చేస్తున్న పరాగ్ అగర్వాల్ నిజంగా మనకు అందరికి ఒక మంచి inspiration.
.webp)
0 కామెంట్లు