* Tuvalu దేశం యొక్క పరిచయం:-
-- Tuvalu దేశం అనేది ఒక ద్వీప దేశం అంటే చుట్టూ సముద్రం ఉండి మధ్యలో దేశం ఉంటే ఆ దేశాన్ని ద్వీప దేశం అంటారు.
-- మరి ఆ దేశ పరిస్థితులు, అక్కడ ఉన్న సమస్యలు, అలాగే ఫ్యూచర్ లో వాళ్ళకి రాబోయే ప్రమాదాలు ఏంటి?
అవ్వన్నీ ఇప్పుడు తెలుసుకుందాం:-
*-- Tuvalu దేశం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మహాసముద్రం అయిన పసిఫిక్ మహాసముద్రం లో ఉన్న ఒక చిన్న ద్వీప దేశం. ఈ దేశం చూడటానికి చాలా అందంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది.
* జనాభా:-
Tuvalu దేశంలో జనాభా చాలా తక్కువగా ఉంటారు. ఆ దేశ జనాభా మొత్తం కలిపి కేవలం 11,000 మాత్రమే ఉంది. అంటే ఈ దేశ జనాభా మొత్తం కలిపితే మన జిల్లా లో ఉండే ఒక మండలంలో ఉన్నంత జనాభా అన్న మాట, అంత తక్కువగా ఉంటారు అన్న మాట ఈ దేశంలో జనాభా.
* ఆ దేశం యొక్క రాజధాని:- ఫునాఫుటి.
* భాషలు:-
-- Tuvalu దేశంలో నివసిస్తున్న ప్రజలకి వాళ్ళు మాట్లాడుకోవడానికి భాషలు కూడా ఉన్నాయి, వాళ్ళు మాట్లాడుకునే భాషలలొ ప్రదానంగా మాట్లాడే భాషలు 1, టువాలువన్ 2, ఇంగ్లీష్. ఈ రెండు భాషలను ఎక్కువగా ఈ దేశంలో నివసించే ప్రజలు మాట్లాడుతారు.
* వీళ్ళ ప్రధాన ఆదాయం:-
-- ఆ దేశంలో నివసిస్తున్న ప్రజలు ఎక్కువగా ఆ పసిఫిక్ మహా సముద్రం లోకి వెళ్ళి చేపలను వేటాడటం వాటిని పట్టుకొని వచ్చి అమ్మడం వాటి మీద వచ్చిన డబ్బు తో జీవనం గడపడం, అలాగే విదేశీ సహాయం, వీటితో పాటు టీవీ, ఇంటర్నెట్ డొమైన్ అద్దె ఇలాంటి పనులు చేసుకుంటూ వారి యొక్క జీవనాన్ని గడుపుతారు అదే వారి యొక్క ప్రధాన ఆదాయ వనరు.
* Tuvalu దేశం ఎంత పెద్దగా ఉంటుంది:-
-- ప్రపంచంలో అతి చిన్న దేశాలలో Tuvalu దేశం కూడా ఒకటి ఈ దేశం కేవలం విస్తీర్ణం లోనే కాదు ఈ దేశం భౌగోళికంగా చాలా తక్కువగా కొన్ని మీటర్ల ఎత్తులోనే సముద్ర మట్టం మీద ఉంటుంది. అలా ఈ దేశం చాలా తక్కువ ఎత్తులో ఉండడం వల్ల ఈ దేశంలో చాలా వాతావరణ మార్పులు వస్తూ ఉంటాయి, ఇలాంటి వాతావరణ మార్పులు ఈ దేశంలో రావడం సర్వ సాదరణం అయిపోయింది. ఇలాంటి వాతావరణ మార్పులు ఈ దేశానికి భయంకరమైన సమస్యగా మారాయి.
ఈ దేశంలో ఈలాంటి మార్పులు రావడం వల్ల అక్కడ నివశిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలని ఎదుర్కొని వాటికి అనుగుణంగా వాళ్ళని వాళ్ళు మలుచుకొని అక్కడ ఉన్న పరిస్థితులకి తగ్గట్టుగా బ్రతుకుతూ ఉంటారు. ప్రతీ రోజు వీళ్ళకి ఒక సవాల్ లాగా ఉంటుంది, దాన్ని ఎదుర్కొని ముందుకి వెళ్తూనే ఉంటారు.
* అసలు ఈ దేశం సమస్య ఏంటి?
-- Tuvalu దేశంలో ఉన్న సమస్యలలో ప్రధానమైన సమస్య ఏంటి అంటే అక్కడ ఉన్న పసిఫిక్ మహాసముద్ర మట్టం పెరగడం. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఆ సముద్రం లో నీరు పెరుగుతుంది అని అర్దం.
-- ప్రపంచంలో పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ వలన అక్కడ ఉన్న అంటే పసిఫిక్ మహా సముద్రంలో ఉన్న మంచు గడ్డలు కరుగుతూ వస్తున్నాయి. ఇంకా మీకు అర్దం అయ్యేలాగా చెప్పాలి అంటే ప్రపంచంలో ఉన్న మొత్తం భూమి చాలా స్పీడ్ గా వేడెక్కుతోంది, అలా వేడెక్కడం వల్ల మంచుతో కప్పబడి ఉన్న ప్రాంతాలు అన్నీ కరుగుతూ వస్తున్నాయి. అలా కరగడం వల్ల మహా సముద్రాలలో ఉన్న నీళ్ళు ఇంకా ఎక్కువ అవుతాయి సముద్ర నీటి మట్టం పెరుగుతుంది అని అర్దం అందులో భాగంగా పసిఫిక్ మహా సముద్రంలో ఉన్న ఒక చిన్న ద్వీప దేశం అయిన టువాలు దేశం ఆ సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉంది కాబట్టి. ఆ దేశం ప్రమాదం లో పడుతుంది కాబట్టి ఈ చర్చ జరుగుతుంది.
-- అక్కడ ఉన్న మంచు గడ్డలు కరగడం వల్ల పసిఫిక్ మహాసముద్రం లో నీటి మట్టం ప్రతీ సంవత్సరం దాదాపుగా 4 నుండి 5 మిల్లీ మీటర్లు నీటి మట్టం పెరుగుతుంది. అది అలాగే పెరుగుతూ పోతే చివరికి ఆ దేశం పసిఫిక్ మహ సముద్రంలో మునిగిపోతుంది అని మేదావులు చెప్తున్నారు, ఒకవేళ అదే కానీ జరిగితే అక్కడ నివసిస్తున్న 11,000 వేల మంది ఎక్కడికి వెళతారు ఎలా జీవిస్తారు ఏం చేస్తారు అన్నదే ఇక్కడ ప్రశ్న వాళ్ళ ఉనికి అనేది పోతుంది, వాళ్ళ దేశ అస్తిత్వం అనేది పోతుంది, వాళ్ళ కల్చర్ వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ గుర్తులు అన్నీ ఆ మహా సముద్రంలో కలిసి పోతాయి అన్నదే ఆ దేశ ప్రజల బాద అని అర్దం అవుతుంది.
ఇది కూడా చదవండి జపాన్ లో భూకంపం.
* ఈ దేశం ఎంత ఎత్తులో ఉంటుంది:-
-- Tuvalu ద్వీప దేశం సగటున 2 మీటర్ల ఎత్తులో ఉంటుంది అంటే అది చాలా తక్కువ ఎత్తు అని అర్దం. ఈ దేశం పసిఫిక్ మహా సముద్ర నీటి మట్టానికి తక్కువ ఎత్తులో ఉంది కాబట్టి, అలాగే భూమి వేడెక్కడం వల్ల అక్కడ ఉన్న మంచు గడ్డలు కరుగుతాయి అలా కరగడం వల్ల సముద్ర మట్టం పెరిగితే, Tuvalu దేశం మొత్తం పసిఫిక్ మహాసముద్రం లో మునిగి పోతుంది. అక్కడ ఉన్న ప్రజలు అందరూ కూడా చనిపోతారు. అందుకే ఆ దేశం చాలా ప్రమాదంలో ఉంది అని హెచ్చరిస్తునారు.
* ఈ దేశం యొక్క పర్యావరణ ప్రభావం ఎలా ఉంటుంది:-
1, ముందుగా ఆ దేశంలో ఉన్న ఏ ప్రాంతాలు ఎఫెక్ట్ అవుతాయి అంటే ఆ దేశంలో ఉన్న తీర ప్రాంతాలు ముందుగా నాశనం అవుతాయి. సముద్ర నీటి మట్టం బాగా పెరిగి దాని ద్వారా ఆ సముద్రంలో వచ్చే అలల తాకిడికి ఆ తీర ప్రాంత భూమి మెల్లి మెల్లిగా తెగిపోతుంది. తెగిపోయి ఆ భూమీ కూడా సముద్రంలోనే కలిసిపోతూ వస్తుంది. దాని వల్ల తీర ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతారు. వాళ్ళకి సంబందిచ్చినవి అన్నీ కూడా సముద్రంలోనే కలిసిపోతాయి.
2, వ్యవసాయం నష్టం:-
-- ఆ దేశంలో ఉన్న వ్యవసాయ భూములు ఏవి అయితే ఉన్నాయో ఆ వ్యవసాయ భూములలోకి సముద్ర నీటి మట్టం పెరిగితే కచ్చితంగా ముందుగా ఆ సముద్రపు నీరు మొత్తం వాళ్ళ వ్యవసాయ భూములలోకి వస్తుంది. సముద్ర జలాల వల్ల ఆ భూములు ఉప్పుగా మారిపోయి పంటలు పండకపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఉప్పు లవణాలు ఎక్కువగా ఉండటం వల్ల అలాంటి నీళ్ళు ఆ భూమిని తాకడం వల్ల ఆ భూమి వ్యవసాయానికి అనుకూలించదు పంటలు సరిగా పండవు దీని వల్ల ఆ దేశంలో వ్యవసాయం అనేది నష్టపోతుంది. అంతే కాకుండా ఆ వ్యవసాయం మీదనే ఆదారపడి బ్రతుకుతున్న ప్రజల పరిస్థితి చాలా భయంకరంగా తయారవుతుంది.
3, మంచినీటి కొరత ఏర్పడటం:-
-- ఆ దేశంలో ఉన్న సముద్ర జలాలు అన్నీ కూడా నీటి మట్టం పెరిగి మీదికి వచ్చి ఆ దేశ భూభాగంలో మొత్తం నిండిపోయి అక్కడ ఉన్న భూగర్భ జలాలలో కూడా కలిసి పోవడం వల్ల, ఉన్న కొంచెం త్రాగు నీరు మరియు మంచి నీరు మొత్తం ఉప్పుగా మారి తాగడానికి అసలు కొంచెం కూడా పనికి రాకుండా పోతాయి. అలా జరగడం వల్ల అక్కడ నివశిస్తున్న ప్రజలకి త్రాగు నీరు లేక చనిపోతారు, ఒకవేళ ఆ ఉప్పు నీరు తాగిన కూడా అనారోగ్య సమస్యలతో కూడా చనిపోతారు ఎటు చూసిన అక్కడ నివశిస్తున్న ప్రజలకి ప్రమాదమే పొంచి ఉంది అని అనేక రకాల కథనాలు అనేక రకాల మేదావులు విశ్లేషణ చేసి చెప్తున్నారు.
4, ఈ దేశంలో వరదలు, తుఫాన్ల ప్రభావం ఎలా ఉంటుంది:-
-- ఈ దేశంలో వరదలు, తుఫాన్లు ఎక్కువగా ఉండటం వల్ల ఆ దేశంలో ఉన్న రహదారులు, ఇళ్లు చాలా వరకు దెబ్బ తింటున్నాయి. ఆల్రెడీ ఇప్పటికే అక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ వాళ్ళ జీవనాన్ని నరకంగా భావిస్తూ బ్రతుకుతున్నారు.
*వీటి వల్ల ఆ దేశ ప్రజల జీవన విధానం పై ఎలాంటి ప్రభావం పడుతుంది:-
-- ఆ దేశ ప్రజలు ఇప్పటికే విద్య, ఉద్యోగం అలాగే ఆరోగ్య సేవలకోసం శరనార్థులుగా బిక్కు బిక్కు మంటూ ఎదురుచూస్తున్నారు కానీ ప్రస్తుతం అవ్వన్నీ సదుపాయాలు అక్కడ దొరకక చాలా మంది ప్రజలు దేశం విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు. కనీసం బ్రతికి ఉంటే ఎక్కడ అయిన ఏదో ఒక పని చేసుకొని బ్రతకవచ్చు కదా అని వాళ్ళ ప్రాణాలని గుప్పిట్లో పెట్టుకొని బాదతో వాళ్ళ కన్న తల్లీ లాంటి దేశాన్ని వదలి వాళ్ళకి సంబందించిన గుర్తులని వదిలి బరువెక్కిన గుండెతో కన్నీళ్లతో నిండిన కళ్ళని తూడ్చుకొని బ్రతుకు జీవుడా అంటూ వేరే దేశాలకి వెళ్లిపోతున్నారు.
-- చాలా మంది ప్రజలు ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలకు వలస వెళ్తున్నారు.
-- పాపం ఇప్పటికే Tuvalu దేశం వాతావరణ శరణార్థుల హోదా కోసం అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళ బాధను చెప్పుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
* Tuvalu దేశంలో ప్రస్తుతం తాజా సంఘటనలు, చర్యలు ఎలా ఉన్నాయి?
-- Tuvalu దేశ ప్రధాని సీమౌ కౌకా 2022 లో అంతర్జాతీయ సదస్సులో అతను నీటిలో నిలబడి మాట్లాడటం జరిగింది. అంటే అతను వాళ్ళ దేశ పరిస్థితి అలా ఉంది అని సముద్ర మట్టం పెరగుతుంది అని ఆ సమస్య ప్రపంచ దేశాల కి కూడా problem అవుతోంది అని, ప్రపంచానికి తెలిసేలా అతను నీటిలో నిలబడి మాట్లాడటం జరిగింది. అప్పుడు అధి ప్రపంచం మొత్తం తెలిసింది.
-- తర్వాత 2023- 2024 మధ్య కాలంలో ఆస్ట్రేలియా దేశంతో ఒక ప్రత్యేకమైన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం Tuvalu దేశ ప్రజలకు భవిష్యత్తులో ఆస్ట్రేలియా లో స్థిరపడే అవకాశం హక్కు కల్పించబడుతుంది.
-- Tuvalu దేశం ఒక డిజిటల్ దేశంగా అవతరించాలని నిర్ణయించుకుంది. అంటే Tuvalu దేశం భవిష్యత్తులో సముద్రం లో మునిగిపోయిన కూడా డిజిటల్ గా Tuvalu దేశం యొక్క రాజకీయ హక్కులు, సాంస్కృతిక హక్కులు అలాగే కొనసాగుతాయి అన్న మాట.
* ఈ దేశంలో భవిష్యత్తులో రాబోయే ప్రమాదాలు:-
-- Tuvalu దేశం 2100 సంవత్సరం నాటికి శాస్త్రవేత్తల అంచనా ప్రకారం పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందంట.
-- అలా జరిగితే గనుక Tuvalu దేశ ప్రజలు వాళ్ళ సొంత దేశాన్ని పూర్తిగా శాశ్వతంగా కోల్పోతారు.
-- భాష, వారసత్వం, సాంస్కృతిక సాంప్రదాయాలు ఇలా వాళ్ళ దేశానికి సంబంధించిన అన్నీ ఆనవాళ్లు కోల్పోతారు.
* Tuvalu దేశం ప్రపంచ దేశాల కి ఇచ్చే సందేశం ఏంటి?
-- Tuvalu దేశం యొక్క పరిస్థితి కేవలం ఆ ఒక్క దేశం సమస్య మాత్రమే కాదు, ఇది ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల సమస్య అలాగే అన్నీ దేశాలకి ఇది ఒక హెచ్చరిక కూడా అవుతుంది.
-- ప్రపంచ దేశాలు వాతావరణ మార్పులను అదుపుచేయకపోతే పసిఫిక్ మహాసముద్రం లో ఉన్న ద్వీప దేశాలు మాత్రమే కాదు, భూమికి తక్కువ ఎత్తులో ఉన్న అన్ని ప్రాంతాలకు ఇలాంటి ప్రమాదమే వస్తుంది.
-- దీనికోసం అంతర్జాతీయ సహకారం అలాగే పర్యావరణ పరిరక్షణ, కాలుష్యం చేయకుండా, పునరుత్పత్తి శక్తి వినియోగం పెరగాలి. అప్పుడే గ్లోబల్ వార్మింగ్ అదుపులో ఉంటుంది.
* ముగింపు మాటలు:-
-- Tuvalu దేశం ఒక అందమైన అద్భుతమైన సుందరమైన ద్వీప దేశం. కాని వాతావరణ మార్పుల వల్ల భవిష్యత్తులో అక్కడ అసలు భూమి అనేదే లేకుండా పోయే ప్రమాదం వచ్చింది. ఆ దేశంలో వచ్చిన సమస్య ఇప్పుడు ప్రపంచ అన్నీ దేశాలకి ఒక సమస్యని గుర్తు చేస్తుంది. అది ఏంటి అంటే వాతావరణాన్ని సురక్షితంగా కాపాడాలి , కాలుష్యాన్ని తగ్గించాలి , గ్లోబల్ వార్మింగ్ అదుపులో ఉంచుకోవాలి అందుకు ప్రపంచ ప్రజలు అందరూ కూడా తగిన జాగ్రత్తలు పాటిస్తూ మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, పరిసరాలను కాపాడుకోవాలి, వాతావరణాన్ని సురక్షితంగా కాపాడాలి అధి ప్రపంచ ప్రజల అందరి బాధ్యత మరి మీరు ఏం అంటారో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి.
ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన website ని daily follow అవ్వండి, మీ friends కి కూడా ఇది share చేయండి. ధన్యవాదాలు.
నేను మీ SAMYEAL CHIRRA.
0 కామెంట్లు